వరంగల్లో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలిసిన ముస్లిం యువతితో రోడ్డుపై మాట్లాడిన ఓ పిజ్జా డెలివరీ బాయ్పై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. రకరకాల ప్రాంతాలను తీసుకెళ్లి బెల్టుతో, కర్రలతో కొట్టగా.. చివరికి ఆ యువకుడు స్పృహతప్పి పడిపోతే.. అప్పుడు ఆస్పత్రికి తీసుకొచ్చి వదిలేశారు. ఈ ఘటన శనివారం (మార్చి 22న) జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 29 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.