హైదరాబాద్ శామీర్పేట ఎస్సై పరశురాం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కాడు. నూనె డబ్బాల చోరీ కేసులో నిందితుడిని తప్పించేందుకు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఎస్సై అతితెలివితో డబ్బును చెత్తబుట్టలో వేయమని చెప్పగా.. బాధితుడు అలాగే చేశాడు. అనంతరం ఎస్సై డబ్బులు తీసుకొని లెక్కిస్తుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.