రాష్ట్రంలోని హోంగార్డు నుంచి ఐపీఎస్ల వరకు పోలీసులందరికీ డీజీపీ శివధర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు అవినీతికి దూరంగా ఉండాలని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్కు లేఖ రాసిన పోలీస్ బాస్.. యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవని స్పష్టం చేశారు. ఇటీవలె లంచం తీసుకుంటూ ఎస్సై, సీఐ అధికారులు ఏసీబీకి దొరికిపోయిన నేపథ్యంలో.. పోలీసు సిబ్బందికి డీజీపీ ఈ హెచ్చరికలు చేశారు.