Manthena Satyanarayana Raju AP Cm Program Coordinator: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో వేగం పెంచింది. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యమిస్తూ, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజుకు కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించింది. ఇప్పటికే పెందుర్తి వెంకటేష్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉండగా, ఇప్పుడు మంతెన సత్యనారాయణరాజుకు కూడా బాధ్యతలు అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకం వెనుక వ్యూహమేంటో వేచి చూడాలి.