తాజాగా తెలంగాణలో నిర్వహించిన మద్యం దుకాణం టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పాల్గొనడమే కాక.. మద్యం షాపు దక్కించుకోడం స్థానికంగా కలకలం రేపింది. సదరు టీచర్ నిబంధనలు ఉల్లఘించిందంటూ ఆమెపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం కాస్త పెద్దది కావడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆమెని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ ముగిసే వరకు సస్పెన్షన్లోనే ఉండాలన్నారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూసింది. ఆ వివరాలు..