తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వికారాబాద్ జిల్లా లగచర్ల, హకీంపేట భూసేకరణపై స్టే ఇచ్చింది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా.. దాన్ని రద్దు చేసింది. కాగా, గతంలో భూసేకరణకు వ్యతిరేకంగా లగచర్లలో రైతులు అధికారులపై దాడి చేసిన సంగతి తెలిసిందే.