హైదరాబాద్లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. లవర్ విషయంలో జరిగిన గొడవలో ఓ మైనర్ బాలుడిని కొట్టి చంపారు. మొదట మాట్లాకుందాం అని పిలిచి.. గ్యాంగ్ అంతా కలిసి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా, కేసు నమోదు చేసి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.