హైదరాబాద్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ లాయర్ను పట్టపగలే అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసి చంపేశాడు ఓ ఎలక్ట్రీషియన్. అయితే.. ఓ లాయర్ను ఎలక్ట్రీషియన్ చంపేందుకు కారణం ఓ మహిళ కావటం గమనార్హం. ఈ ఘటన ఆదివారం రోజున ఉదయం జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.