ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. కల్తీ మద్యం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అటు టీడీపీ , ఇటు వైసీపీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన జనార్ధన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ మీద కూడా ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఇంత సీరియస్గా సాగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ షాపుల వద్ద మద్యం అమ్మకాలకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.