నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ వైద్యుడు వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. లిఫ్ట్ పేరుతో బాధితురాలిని కారు ఎక్కించుకున్న సదరు దుర్మార్గుడు కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గడ్డి మందు ఇంజెక్ట్ చేసి ఆమె ప్రాణాలు బలి తీసుకున్నాడు.