లీటర్ పెట్రోల్ రూ.500 అవుతుదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరుగుతాయంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అది నిజమని నమ్మిన కొందరు హైదరాబాద్ పాతబస్తీ యువకులు పెట్రోల్ బంకుల ఎదుట బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకున్నారు.