డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురానుంది. 55 ఏళ్లు పైబడిన వారు లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలంటే డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాలి. అంతేకాదు, మెడికల్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి!