ఏపీ మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం అంశంపై నిర్ణయం ఎవరూ వ్యక్తిగతంగా తీసుకునేది కాదని చెప్పారు. పదవులైనా, ఎలాంటి నిర్ణయాలైనా కూటమిలోని మూడు పార్టీల పెద్దలు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారని... ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి లోకేశ్ వచ్చారని.. ఎవరు వద్దన్నా, కాదన్నా టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేశే నాయకుడని అన్నారు.