Andhra Pradesh MPs Attendance: ఆంధ్రప్రదేశ్ ఎంపీల పార్లమెంటరీ పనితీరుపై పీఆర్ఎస్ ఇండియా నివేదిక విడుదల చేసింది. టీడీపీ ఎంపీలు అప్పలనాయుడు, హరీష్లు హాజరులో ముందుండగా, అవినాష్ రెడ్డి వెనుకబడ్డారు. ప్రశ్నలు అడగడంలో అప్పలనాయుడు, చర్చల్లో శ్రీకృష్ణదేవరాయలు అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణలో ఈటెల రాజేందర్ ప్రశ్నల్లో, కిరణ్ కుమార్ రెడ్డి హాజరులో టాప్ లో నిలిచారు. ఓవైసీ చర్చల్లో ముందంజలో ఉండగా, రఘువీర్ రెడ్డి రెండు అంశాల్లోనూ చివరి స్థానంలో ఉన్నారు.