131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది జాతీయ విపత్తును నివారించిన రోజు అని అభివర్ణించారు. ఈ బిల్లును వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకాతాటిపైకి రావడం శుభపరిణామమని తెలిపారు. ఈ బిల్లు వీగిపోయిన రోజు.. సువర్ణదినంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.