తెలంగాణ హౌసింగ్ బోర్డు మరో పోటీ ప్రకటించింది. క్యూర్ పరిధిలో నిర్మించతలపెట్టిన లక్ష ఇళ్ల పథకానికి సంబంధించి మరో పోటీ ప్రకటించింది. ఇటీవలే పథకం పేరు సూచించిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించిన హౌసింగ్ బోర్డు అధికారులు.. ఇప్పుడు పథకం లోగో డిజైన్ చేసిన వారికి లక్ష క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. జులై 12వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు లోగో డిజైన్ చేసి పంపించవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.