వైసీపీ పైనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. వక్ఫ్ భూములను ఆక్రమించి సాక్షి ఆఫీసును కట్టారంటూ టీడీపీ ఆరోపించింది. ఈ కారణంతోనే వక్ఫ్ బిల్లును వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించింది. మరోవైపు వక్ఫ్ బిల్లును రాజ్యసభలో వైసీపీ వ్యతిరేకించింది. బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదన్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. . వేలాది ఏళ్లుగా ముస్లింల అధీనంలో ఉన్న భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కలిగించినట్లేనని అన్నారు.