కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. మే తొలి వారంలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన కవిత.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషిస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. తాను ఎన్నికల్లో సిద్దిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.