Magunta Srinivasulu Reddy On Son Contesting: ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజు నాడే సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాను పోటీ చేశానని, తమ కుటుంబాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. పలు పార్టీలు మారిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.