ఢిల్లీ పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 15వ తేదీ లోపు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పెద్దలతో మంత్రులు భేటీ అయ్యారని.. పార్టీ బలోపేతం, తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై రాష్ట్ర నేతలను ఢిల్లీ నేతలు అభినందించినట్లు పేర్కొన్నారు.