తెలంగాణలో ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని నింపింది. కాగా, వడదెబ్బ కారణంగా మృతి చెందిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందిస్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) ద్వారా రూ.4 లక్షల వరకు మృతుల కుటుంబాలకు అందుతాయి. అయితే ఈ పరిహారం పొందడానికి పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్, వాతావరణ శాఖ ధ్రువీకరణ వంటి నిబంధనలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.