తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటుగా శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.