తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.