వరంగ ఎంజీఎం ఆసుపత్రిలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మాజీ యూనియన్ లీడర్ మామూళ్ల కోసం దారుణంగా ప్రవర్తించింది. ఔట్ సోర్సింగ్ కార్మికురాలిని గొలుసులతో కొట్టి చిత్రహింసలకు గురి చేసింది. ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించింది. ఘటనపై సీరియస్ అయిన స్థానిక ఎమ్మెల్యే ఆమెపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు.