వరంగల్ మోడల్ బస్స్టాండ్ పనులు నిలిచిపోయి, తవ్విన గుంత నీటితో నిండిపోవడంతో అది చెరువుగా మారింది. ఈ పరిస్థితిపై బీజేపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. బస్స్టాండ్ ప్రాంగణంలో పడవలతో తిరుగుతూ.. పూలు చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయని.. కాంట్రాక్టర్ మట్టితవ్వకాలు పూర్తి చేసి వదిలేశాడని వారు ఆరోపించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, ఎర్రబల్లి ప్రదీప్రావు నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే పనులు ప్రారంభించాలని బీజేపీ డిమాండ్ చేసింది. చెరువులా మారిన బస్స్టాండ్ ప్రాంగణంలో పడవల నిరసన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.