వరంగల్ జిల్లాలోని క్రికెట్ ప్రేమికులకు, యువతకు గుడ్న్యూస్. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్డేడియం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చురుగ్గా పనులు జరుగుతున్నాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మె్ల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులో ఈ స్టేడియం అందుబాటులోకి రానుందని చెప్పారు. క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తే ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.