రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని ఎవరు కోరుకోరు! కానీ అలా అవడానికి ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి విషయాల్లో ముందుంటారు. తొలకరి వర్షాలు పడితే చాలు.. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు తరలివెళ్తారు. మైనింగ్ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాల్లో వజ్రాల కోసం జల్లెడ పడతారు. ఈ ప్రాంతాల్లో ఏటా రూ. 4 నుంచి రూ. 5 కోట్ల విలువైన వజ్రాలు లభిస్తాయట. మరి ఇక్కడే వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయి? దానికి కారణాలేంటో? ఇప్పుడు తెలుసుకుందాం.