వర్షాల సమయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం, విధుల్లో నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందుగా సూచనలు చేసినప్పటికీ.. అధికారులు సరైన చర్యలు చేపట్టలేదని ఆగ్రహించారు. వర్షాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై అధికారులకు మరోసారి కీలక సూచనలు చేశారు. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి అధికారి వరకు అందరూ వర్షం పడినప్పుడు రోడ్డుపైకి రావాలని.. అవసరమైతే తానే రోడ్డుపైకి వస్తానని తేల్చి చెప్పారు.