వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆత్కూరులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఈరోజు (ఏప్రిల్ 01) ముగిసిపోతుండటంతో.. మరోసారి రిమాండ్ను కోర్టు పొడిగించింది. వంశీ రిమాండ్ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. మరోవైపు, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది.