గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్కు ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వల్లభనేని వంశీతో పాటుగా మరో నలుగురికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో మంగళవారమే వల్లభనేని వంశీ రిమాండ్ గడువు ముగిసింది. దీంతో పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు వంశీ రిమాండ్ను మరో రోజు పొడిగించింది. అయితే తాజాగా వల్లభనేని వంశీతోపాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది.