గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. భూకబ్జా కేసులో గన్నవరం కోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. ఆత్కూరులో నమోదైన కేసులో వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో బెయిల్ వచ్చినప్పటికీ వల్లభనేని వంశీ జైళ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.