కొందరు ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల వివాదాల్లో తలదూరుస్తున్నారని, బెదిరిస్తున్నారని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వం చులకన అవుతుందన్నారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొందరు అధికారుల తీరు సరిగా లేదన్నారు. దీనికి, ఎమ్మెల్యేలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇంఛార్జి మంత్రులదే అని సీఎం చంద్రబాబు తెలిపారు.