వాట్సాప్లో కొత్త సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి, సహజీవనం పేరుతో యువతను బురిడీ కొట్టి డబ్బు గుంజడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రొఫైల్స్తో పరిచయమై, నమ్మకం పెంచుకుని, డబ్బు డిమాండ్ చేయడం లేదా వీడియో కాల్స్తో బ్లాక్మెయిల్ చేయడం వంటివి జరుగుతున్నాయని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.