ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆదర్శ పాలనను సీఎం గుర్తు చేశారు. ఒంటిమిట్టలో కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.. ముఖ్యమంత్రి ఈ నెల 11న పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్రమంతటా రామనామ స్మరణతో పండుగ వాతావరణం నెలకొంది.