కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఇంటి పక్కనే నివాసం ఉండే పదో తరగతి చదువుతున్న బాలుడే అత్యంత దారుణంగా సహస్రను హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. సహస్ర ఇంట్లో క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి వెళ్లిన బాలుడు, దొరికి పోవడంతో బాలికపై దాడి చేసి హత్య చేశాడు. ఈ క్రమంలో సహస్ర తండ్రి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు..