కోస్తాంధ్ర తీరం నుంచి నైరుతి బంగాళాఖాతానికి ఉపరితల ఆవర్తనం తరలడంతో.. తెలంగాణలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా వెనక్కి మళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. దీని వల్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రజలు సురక్షిత ఆశ్రయాలు తీసుకోవాలని, రైతులు కోత దశలో ఉన్న పంటలను రక్షించుకోవాలని జాగ్రత్తలు సూచించారు.