తెలంగాణ నేడు అనగా శుక్రవారం వాతావరణానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయ్యిందని పేర్కొంది. అయితే ఇదే సమయంలో రాష్ట్రం మీద ఈశాన్య రుతుపవనాల ప్రభావం మొదలు కానుంది అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాత్రి వేళ చలి తీవ్రత పెరిగింది. ఇదిలా ఉంటే హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పిడుగులు పడేందుకు ఛాన్స్ ఉందని తెలిపారు.