తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానల వల్ల పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఇళ్లు, పంట పొలాలు నీట మునిగి.. చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాన్స్టాప్గా కుండపోత వానలు కురుస్తాయని.. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ వివరాలు..