తెలంగాణలో వరుసగా కురిసిన భారీ వర్షాలు చివరికి విరమించాయి. వాయుగుండం బలహీనపడటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత తగ్గింది. రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చిత్తడిగా జల్లులు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రజలకు ఊరటను కలిగించింది. అంతే కాకుండా.. హైదారబాద్లో రానున్న రెండు రోజులు చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.