కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. మంకమ్మతోటలో ఒక వృద్ధురాలిపై కోతులు దాడి చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సైదాపూర్ మండలంలో కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో గ్రామస్తులు వణికిపోయారు. కోతుల సమస్యను పరిష్కరించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.