Rayalacheruvu Floods Rs 10000 For Each: తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం రాయలచెరువు గండితో ఐదు గ్రామాలు మునిగిపోయాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. గ్రామంలో పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టారు. ఈ మేరకు కళత్తూరులో 600 మంది సిబ్బందితో బురద తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. బాధితులకు రూ.10వేల సాయంతో పాటు, పశువులకు నష్టపరిహారం కూడా అందిస్తున్నారు. స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత ఇవ్వనుంది.