మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వరుసగా మూడోసారి ఆడబిడ్డకు జన్మనిస్తే.. ఆ అమ్మాయి పేరిట రూ.50 వేలు డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. అలాగే వరుసగా మూడోసారి మగబిడ్డకు జన్మనిస్తే.. ఆవు, దూడను బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించారు. విజయనగరంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ.. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో శాశ్వతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు,