ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు సంభంధించి కీలక అప్డేట్ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయ్యే వారికి పరిహారం అందించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1000 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. శనివారం నాడు ఈ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ కన్నా ముందే.. నిర్వాసితులకు కాలనీలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఆ వివరాలు..