తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం మానసిక ధైర్యాన్ని కల్పిస్తుందని మంత్రి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్ శిశువిహార్ సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారులకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తామని తెలిపారు. ఆసరా లేని పిల్లల్ని చేరదీసి వారిని సంరక్షిస్తే నెలకు రూ.4,500 ఇస్తామని ప్రకటించారు.