రాష్ట్రంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులకు నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. అంతే కాకుండా.. అర్హత లేని వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తుస్నట్లు అధికారుల దృష్టికి వస్తుండటంతో అప్రమత్తం అయ్యారు. బోగస్ రేషన్ కార్డులు వేరేసే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే అక్రమంగా వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు వచ్చాయనే కారణంగా.. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలోని చట్టబద్ధతలేని వలస లంబాడీల ఆహార భద్రత కార్డులను రద్దు చేశారు.