వారికి భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. రేషన్ కార్డులపై కీలక ప్రకటన..

5 months ago 23
తెలంగాణలో అర్హత ఉండి రేషన్ కార్డు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి కొత్త కార్డులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం వాటిని త్వరలోనే అందజేస్తుందని భరోసా ఇచ్చారు. ఆహార భద్రతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ చేరాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఏదులాపురంలో జేఎన్‌టీయూ కళాశాల, నర్సింగ్ కాలేజీ వంటి రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Read Entire Article