తెలంగాణ యాదాద్రి జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్పీవోలకు రెండు సీజన్లకు సంబంధించిన పెండింగ్ కమీషన్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో ఆయా సంఘాల ఖాతాల్లో భారీగా డబ్బులు జమ అయ్యాయి. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు ఇది ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు. త్వరలోనే వడ్ల కొనుగోలు మొదలు కాబోతుండటంతో పెండింగ్ బకాయిలను విడుదల చేసింది.