వారికి శ్రీవారి దర్శనం కల్పించొద్దు.. తిరుమలలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

1 year ago 28
తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిపై కేసులు నమోదు చేస్తామన్న టీటీడీ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు అభినందనీయమని కొనియాడారు. రాజకీయాలు మాట్లాడేవారిపై కేసులు పెట్టడంతో పాటుగా వారికి శ్రీవారి దర్శనం కల్పించకూడదని కిషన్ రెడ్డి సూచించారు. స్థానికులకు నెలలో ఒకరోజు శ్రీవారి దర్శనం కల్పించాలన్న టీటీడీ నిర్ణయంపైనా కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Read Entire Article