Ys Viveka Murder Death Anniversary: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదంటున్నారు ఆయన కుమార్తె సునీత రెడ్డి. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించారు. 'వివేకా హత్యకు గురై ఆరేళ్లయింది.. ఈ కేసులో ఇంకా మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా బయట తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నా.ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు' అన్నారు.