బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పార్టీ షాక్ ఇచ్చింది. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను తొలగించి.. కొప్పుల ఈశ్వర్ను నియమించారు. దీనిపై కవిత స్పందిస్తూ.. తన తొలగింపు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కార్మికులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో కార్మికుల కోసం చేసిన కృషిని ఆమె గుర్తు చేసుకున్నారు.